లారీని ఢీకొన్న స్కూల్ బస్సు

13 Dec, 2016 10:00 IST|Sakshi
లారీని ఢీకొన్న స్కూల్ బస్సు

నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. నర్సంపేట సెయింట్ మేరీ స్కూల్‌కు చెందిన బస్సు 50 మంది విద్యార్థులతో వేగంగా వెళుతూ ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ సంఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు చేర్చారు.
 

మరిన్ని వార్తలు