మూడు గంటలకే బడి బంద్‌

29 Aug, 2016 23:17 IST|Sakshi
మూడు గంటలకే బడి బంద్‌
రాంరెడ్డిపల్లి (మర్రిగూడ) :  మండలంలోని రాంరెడ్డిపల్లి ప్రాథమికొన్నత పాఠశాల ఉపాధ్యాయలు సమయ పాలన పాటించడం లేదు.  1 నుంచి 7 వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయలు ఉన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4.15 గంటలకు పాఠశాలను మూసి వేయాల్సి ఉండగా సోమవారం మాత్రం 3 గంటలకే పాఠశాలకు తాళం చేశారు. ఈ పాఠశాల ఉపాధ్యాయలు సమయ పాలన పాటించడం లేదని స్థానికులు ఆరోపించారు. దీనిపై ఎంఈఓ ఎం.సు«ధాకర్‌ను వివరణ కోరుగా అనుమతి లేకుండా పోయిన ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు