పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్‌ బృందం

22 Sep, 2016 21:55 IST|Sakshi
పాఠశాలలను తనిఖీ చేసిన మానిటరింగ్‌ బృందం

రామన్నపేట
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన  మానిటరింగ్‌ బృందం జిల్లా అధికారులు గురువారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను, జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసింది. కొండకింది అంజిరెడ్డి, సామల రమేష్‌తో కూడిన బృందం సభ్యులు పాఠశాలలోని రికార్డులను, మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. తరగతులలో అధ్యాపకుల బోధనా సామర్థ్యంతో పాటు, విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు.  పాఠశాలల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. డివిజన్‌లోని అన్ని ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.  



 

మరిన్ని వార్తలు