కమలాపూర్ : కమలాపూర్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 23, 24 తేదీల్లో నియోజకవర్గ పరిధిలోని సైన్స్ టీచర్లకు రెండు రోజుల పాటు సైన్స్ సెమినార్ జరుగుతుందని కమలాపూర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఈటల సమ్మన్న ఒక ప్రకటనలో తెలిపారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (లండన్) సహకారంతో కమలాపూర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లోని 40 మంది సైన్స్ టీచర్లకు సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్లో నియోజకవర్గంలోని సైన్స్ టీచర్లు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.