ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో..

5 Jun, 2016 19:10 IST|Sakshi

భోగాపురం(విజయనగరం): ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అమనాం జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కార్పియో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు