దళితులను విభజించడం న్యాయం కాదు

13 Aug, 2016 00:37 IST|Sakshi
దళితులను విభజించడం న్యాయం కాదు
చండూరు : దళితులను విభజించడం బీజేపీకి న్యాయం కాదని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేరి రమేశ్‌ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా భేరి రమేశ్‌ మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ పోరాటానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ హాజరు కావడం ఎంత వరకు సబబన్నారు. దళితులను విభజించే కుట్రను బీజేపీ మానుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గోటి సైదులు, అనిల్, వంశీ, నాగరాజు ఉన్నారు. 
 

 

మరిన్ని వార్తలు