శిల్పసంపద అద్భుతం

25 Aug, 2016 01:08 IST|Sakshi
శిల్పసంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని ఫ్రాన్స్‌కు చెందిన మార్టిమ్‌ విలియమ్‌ అన్నారు. బుధవారం ఆమె ఆలయాన్ని సందర్శించారు. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూశానని, 21 రోజుల పాటు తెలంగాణలో తిరిగి పలు ప్రాచీన దేవాలయాలను  సందర్శిస్తున్నామని తెలిపారు. అన్ని దేవాలయాల్లోనూ అపురూపమైన శిల్పసంపద ఉందని, ఇవి ధ్వంసం కాకుండా చూడాలని అన్నారు. వరంగల్‌లోని కట్టడాలు, రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు. అనంతరం గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు.  
మరిన్ని వార్తలు