మూడో రోజు 791 మంది ఎంపిక

10 Dec, 2016 23:42 IST|Sakshi
– కొనసాగుతున్న కానిస్టేబుల్‌ సామర్థ్య పరీక్షలు
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థుల సామర్థ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మూడో రోజు 791 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఉదయం 5 నుంచి రాత్రి 9.45 గంటల వరకు కొనసాగిన సామర్థ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ఆకు రవికృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాలని ఆదేశించారు. మొత్తం 1,305  మంది హాజరు కాగా.. సర్టిఫికెట్లు లేకపోవడంతో 150 మందిని వెనక్కు పంపారు.
మరిన్ని వార్తలు