రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు

12 May, 2016 20:46 IST|Sakshi

ఎర్రుపాలెం: గొల్కొండ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారి పట్టాలపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం పట్టణానికి చెందిన దర్రు రామారావు(41) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వరకు వెళుతుండగా డోర్ దగ్గర కూర్చోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు కాళ్లు నుజ్జుకావడంతో రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు