మొరాయించిన సర్వర్‌

29 Dec, 2016 23:16 IST|Sakshi
- బ్యాంకుల్లో స్తంభించిన లావాదేవాలు
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో గురువారం సర్వస్‌ సమస్య ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం వరకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.  జిల్లాలోని అన్ని బ్యాంకులు అనంతపురం జోన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వర్‌ పరిధిలో ఉన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సర్వర్‌ పనిచేయకపోవడంతో బ్యాంకుల్లో లావాదేవీలు జరగలేదు. కరెన్సీ కొరతతో అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. సర్వర్‌ సమస్యతో గురువారం ఇబ్బందులు తప్పలేదు. కొద్దోగొపోప నగదు తీసుకునేందుకు వచ్చిన అన్ని వర్గాల ప్రజలు సర్వర్‌ పనిచేయక  వెనుదిగిరి వెళ్లారు.
>
మరిన్ని వార్తలు