ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ

29 Sep, 2016 20:00 IST|Sakshi
ఏపీలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ

విజయవాడ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పలు నామినేటెడ్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసింది. చాలాకాలంగా వాయిదా వేస్తూ వచ్చిన నామినేటెడ్‌ పోస్టులను సర్కార్ గురువారం శ్రీకారం చుట్టింది. టీడీపీ ఆశావాహులు నామినేటెడ్ పోస్టులపై కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
 

  • విజయవాడ దుర్గగుడి చైర్మన్ గా యలమంచిలి  గౌరంగబాబు (కృష్ణా)
  • ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మహముద్ హిదాయత్ (గుంటూరు)
  • ఏపీ మేదర కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా ఎం. సుందరయ్య (చిత్తూరు)
  • ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జయరామిరెడ్డి (చిత్తూరు)
  • ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పాలి ప్రసాద్ (పశ్చిమ గోదావరి)
  • ఏపీ కనీస వేతనాలు బోర్డు చైర్మన్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ (గుంటూరు)
  • కృష్ణ బలిజ, పూసల కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ గా కావేటి సామ్రాజ్యం (గుంటూరు)
  • ఏపీ గీత కార్మికుల  కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తోట జయప్రకాశ్ నారాయణ (గుంటూరు)

>
మరిన్ని వార్తలు