23 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు

5 Aug, 2016 19:36 IST|Sakshi
కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 23, 24, 25 తేదీల్లో కరీంనగర్‌లో జరుగుతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతి, బత్తిని సంతోష్‌ తెలిపారు. సమావేశాల ఆహ్వానపత్రాలను శుక్రవారం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ ముద్దసాని రమేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. విద్యారంగ పరిరక్షణకు అందరూ సహకరించాలని రమేశ్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి రజినీకాంత్, నాయకులు భాను, మౌనిక, సాగరిక పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు