శ్రీవారి సేవలో శిల్పాశెట్టి

20 Jul, 2015 16:18 IST|Sakshi

తిరుమల: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం కల్యాణం విరామ సమయంలో వారు స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం శిల్పాశెట్టి, పింకీరెడ్డి లు ఆలయం వెలుపల సెల్ఫీలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు