గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం

20 Jul, 2016 12:51 IST|Sakshi
గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం

కంబదురు(అనంతపురం): పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాక అడ్డొచ్చిన వాచ్‌మెన్‌ను కత్తులతో బెదిరించి పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మల్లేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన వాచ్‌మెన్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతన్ని కత్తులతో బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు