శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు

29 Oct, 2015 00:21 IST|Sakshi
శ్యామల, రమేశ్‌లకు హైకోర్టులో చుక్కెదురు

ప్రత్యూషపై చిత్రహింస కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ

 సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురి చేసిన ఆమె సవతి తల్లి చిప్పా చాముండేశ్వరి అలియాస్ శ్యామల, తండ్రి రమేశ్‌లకు హైకోర్టులో  చుక్కెదురైంది. ప్రత్యూషను తీవ్ర హింసకు గురిచేసిన కేసులో వారికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వారు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్‌ను కిందిస్థాయి కోర్టు తోసిపుచ్చింది.  దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్యామల, రమేశ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేసుకున్నారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం విచారించారు.

>
మరిన్ని వార్తలు