భూములు పరిశీలించిన సింగపూర్‌ ప్రతినిధులు

4 Jun, 2017 23:29 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్‌ : ఇటీవల ఏపీఐఐసీ కొనుగోలు చేసిన భూములను ఆదివారం సింగపూర్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. పరిశ్రమల కోసం మండలంలోని కప్పలబండ గ్రామం వద్ద రైతులతో కొనుగోలు చేసిన 101 ఎకరాల భూమిని వారు పరిశీలించారు. ఆ స్థలానికి బెంగళూరు ఎయిర్‌ పోర్టు 100 కిలోమీటర్ల దూరం ఉందని, రైల్వే లైను, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, హంద్రీనీవా కాలవ సదుపాయాలపై మంత్రి వారికి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు