బదిలీపై వచ్చిన కార్మికులకు సెటిలింగ్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికులు ధర్నా చేశారు. గురువారం మధ్యాహ్నం దాదాపు 50 మంది కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెబ్బనలోని సింగరేణి జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం అధికారులకు ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు.