కువైట్‌లో సింహాద్రిపురం వాసి మృతి

22 Oct, 2016 23:46 IST|Sakshi
కువైట్‌లో సింహాద్రిపురం వాసి మృతి

 సింహాద్రిపురం :  సింహాద్రిపురంలోని కొత్త చౌడేశ్వరి ఆలయం వీధికి చెందిన తాటిచర్ల జాఫర్‌(45) కువైట్‌లో  శుక్రవారం రాత్రి   అనారోగ్యంతో మృతి చెందారు. అతనికి భార్య ఖాజా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె తాహిదాకు వివాహం కాగా.. రెండో కుమార్తె కుళ్లాయమ్మ తిరుపతిలో నర్సింగ్‌ చేస్తోంది. కుమారుడు రియాజ్‌ సింహాద్రిపురం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. 2006లో జాఫర్‌ కువైట్‌కు వెళ్లారు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లారు.  అనారోగ్యంతో ఉన్న జాఫర్‌కు గతనెల 19వ తేదీన ఆపరేషన్‌ జరిగింది. కువైట్‌లో పార్వానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారంర   మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాఫర్‌ మృతదేహాన్ని కువైట్‌ నుంచి స్వగ్రామానికి తెచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
 

మరిన్ని వార్తలు