రోప్‌ వే కోసం స్థల పరిశీలన

26 Sep, 2016 22:04 IST|Sakshi
రోప్‌ వే కోసం స్థల పరిశీలన
భువనగిరి టౌన్‌ : భువనగిరి ఖిలా అభివృద్ధిలో భాగంగా ఖిలాపైకి రోప్‌వే ఏర్పాటు చేసేందుకు కోల్‌కతాకు చెందిన కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, మనోజ్‌లు స్వోరం స్థలాన్ని పరిశీలించారు. రోప్‌ వే కోసం బైపాస్‌ సమీపంలో ఉన్న 2.30 ఎకరాల భూమి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడి నుంచి ఖిలాపైకి రోప్‌ వే ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రోప్‌ వే కోసం వ్యయంతో పాటు, పూర్తి వివరాలను అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారి వెంట సోమ శేఖర్‌రెడ్డి ఉన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు