డీఎస్‌ఓగా శివరాంప్రసాద్‌

12 Apr, 2017 00:50 IST|Sakshi
అనంతపురం అర్బన్ : జిల్లా సరఫరాల అధికారిగా (డీఎస్‌ఓ) శివరాంప్రసాద్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. ప్రస్తుతం కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖలో అసిస్టెంట్‌ గ్రై¯ŒS పర్చేజ్‌ అధికారిగా ఉంటున్న శివరాంప్రసాద్‌కి డీఎస్‌ఓగా పదోన్నతి కల్పిస్తూ జిల్లాకు బదిలీ చేసింది. ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టవచ్చని డీఎస్‌ఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక్కడ డీఎస్‌ఓ విధులు నిర్వర్తిస్తున్న ప్రభాకర్‌రావు ఈ ఏడాది జనవరి 31న ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ డి.శివశంకర్‌రెడ్డి ఇ¯ŒSచార్జి డీఎస్‌ఓగా వ్యవహరిస్తున్నారు. 
మరిన్ని వార్తలు