పాము కాటుతో ఆరేళ్ల పాప మృతి

10 Sep, 2015 11:36 IST|Sakshi

కర్నూలు : కర్నూలు జిల్లా కోసిగి మండలం చిత్తనకల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నేలపై నిద్రిస్తున్న ఆరేళ్ల  చిన్నారిని గురువారం పాము కాటేసింది. దాంతో పాప ఏడవటం ప్రారంభించింది. పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మరణించింది. దీంతో ఆ చిన్నారి మృతితో తల్లిదండ్రులు ఈరన్న, అంజనమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు