ఆరో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి

30 Mar, 2016 03:01 IST|Sakshi
ఆరో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి

శామీర్‌పేట్: ఆరో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈఘటన చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతంలోని బోర్‌పేట్‌కు చెందిన మామిండ్ల రత్నాల, భాగ్యలక్ష్మి దంపతులు కొన్నేళ్ల క్రితం మండలంలోని అలియాబాద్‌క వలస వచ్చారు. స్థానికంగా ఓ స్పిన్నింగ్‌మిల్‌లో పనిచేస్తూ అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నారు.

వీరు దత్తత తీసుకున్న మాధవి(12)  లాల్‌గడిమలక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతుంది. మంగళవారం స్కూల్ నుంచి వచ్చిన బాలిక ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంది. సాయంత్రం తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత వచ్చిన మాధవి తల్లిదండ్రులు విషయం గమనించి లబోదిబోమన్నారు. సీఐ సత్తయ్య ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు