ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య జి.శ్రీధర్ మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రివేళ గుండెపోటు రావడంతో హుటాహుటిన పుట్టపర్తి సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. హృదయనాళం పనితీరులో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం స్టంట్ వేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుటపడినట్లు శ్రీధర్ కుటుంబసభ్యులు తెలిపారు.