ఆగస్టు 1న ఎస్‌ఎంసీ ఎన్నికలు

20 Jul, 2016 18:07 IST|Sakshi
 
 
 ఆత్మకూరు : ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ (పాఠశాలల యాజమాన్య కమిటీ) ఎన్నికలు ఆగస్ట్‌ 1వ తేదీన జరగనున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభించాల్సి ఉండగా వాయిదా వేశారు. తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్నికలను వచ్చే నెల 1న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. 3 గంటలకు ప్రమాణస్వీకారం, 4 గంటలకు తొలి సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నారు. కాగా ప్రక్రియ ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు నోటిఫికేషన్‌ విడుదల, మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 29న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్నికలను నిర్వహించనున్నారు. 
 
మరిన్ని వార్తలు