నేడు కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని రాక

7 Jun, 2016 09:08 IST|Sakshi

విజయవాడ :  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని మంగళవారం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పార్టీ చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె నగరంలో పర్యటించనున్నట్లు ఉమామహేశ్వరరాజు తెలి పారు. ఉదయం 11.30 గంటలకు వన్‌టౌన్ కేబీఎన్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో, సాయంత్రం 4గంటలకు ఎ-ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు