శంషాబాద్‌లో బంగారం పట్టివేత

6 Nov, 2016 10:54 IST|Sakshi

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 645 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఆదివారం ఉదయం రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు