ఆస్పత్రిలో తాచుపాము కలకలం

27 Aug, 2016 20:54 IST|Sakshi
గోకవరం :
బుసలు కొడుతూ ఓ తాచుపాము గోకవరం ప్రభుత్వాస్పత్రిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం స్వీపరు ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తుండగా తాచుపాము తారసపడింది. ఆమె భయంతో గట్టిగా కేకలు పెట్టడంతో.. ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పాము అక్కడున్న సిమెంటు దిమ్మ కిందకు చేరుకుంది. పడగవిప్పి బుసలు కొట్టడంతో దాని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ పామును హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడు నెలల క్రితం కూడా ఆస్పత్రిలోకి ఇలాగే తాచుపాము ప్రవేశించగా అప్పట్లో కొట్టి చంపారు.
 
 
 
మరిన్ని వార్తలు