ఆమనగల్లు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రెండవ ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండవ ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఏఎన్ఎంలు ఒకరోజు దీక్షనిర్వహించారు. రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం వేతనాలను అందించాలని, ఇతర అలవెన్సులను అందించాలని ఎఎన్ఎంలు కోరారు. సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగిస్తామని ఎఎన్ఎంలు చెప్పారు. సమ్మెలో రెండవ ఎఎన్ఎంలు మంజుల, మారతమ్మ, పద్మ, రాజేశ్వరీ, సునీత, పార్వతి, ఆసీఫా, కరుణశ్రీ, సునీతాబాయి తదితరులు పాల్గొన్నారు.