ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటికే..

14 Dec, 2016 11:06 IST|Sakshi
కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్య
దొనకొండ(ప్రకాశం జిల్లా):
దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాదం వీర వెంకట్రామయ్య(15) అనే బాలుడు ఊరికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. 
 
కుమారుడి మరణవార్త విన్న తండ్రి సాదం పెదరామయ్య(52) మనస్తాపంతో కాసేపయిన తర్వాత అదే ట్రాక్‌పై కిలో మీటర్ దూరంలో గుంటూరు-కాచిగూడ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు