తండ్రిపై తనయుడి దాడి

25 Jul, 2016 00:22 IST|Sakshi
హిరమండలం  : మండలంలోని ధనుపురం గ్రామంలో తండ్రిపై కొడుకు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. 30 సెంట్లు భూమి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. ఈ సమయంలో సిరుపురం రామారావుపై ఆయన కుమారుడు సంపతిరావు కత్తి, కర్రతో దాడికి పాల్పడ్డాడు. దీంతో రామారావుకు కుడి చేయి, చెవి దగ్గర తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం  శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు