మేనల్లుడుని హతమార్చిన మేనత్త

8 Nov, 2016 23:00 IST|Sakshi
  • కోరిక తీర్చమన్నాడనే హత్య
  • మిస్టరీని ఛేదించిన పెద్దాపురం పోలీసులు
  • పెద్దాపురం :
    తన కోరిక తీర్చమంటూ వరుసకు మేనత్త అయిన వివాహితను వేధిస్తున్న మేనల్లుడిని ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న మరో ఇరువురితో కలసి హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 27న పెద్దాపురం మండలం దివిలిలో గ్రామానికి చెందిన చాపల శివ(21) విద్యుత్‌ షాక్‌తో మృతి చెందినట్లు పోలీసులు తెలుపూతు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే అందరూ విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడనుకుని వదిలేసిన కేసును నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌.ప్రసన్న వీరయ్యగౌడ్‌ తిరిగి విచారణ మొదలుపెట్టారు. విచారణ ఆరంభించే సరికి విచిత్రమైక పోకడలు కనిపించడబంతో సీఐ ఇది తప్పనిసరిగా హత్యేనని భావించి దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో ఈ హత్య వెనుకు ముగ్గురు నింధితులున్నట్లు గుర్తిం చారు. ఈ మేరకు మంగళవారం సీఐ ఎస్‌.ప్రసన్న వీరయ్యగౌడ్‌ ఎస్‌ఐలు వై.సతీష్, ఏసుబాబుతో కలిసి మిస్టరీ వివరాలను వెల్లడించారు. 
    శివకు వరుసకు మేనత్త అయిన అదే గ్రామానికి చెందిన మోర్త మరియమ్మ పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన మేకల ఏసు, అక్కిరెడ్డి పెద్దకాపు అలియాస్‌ పెద్దతో వివాహేతర సంబం««దlం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న మేనల్లుడు శివ తన కోరిక తీర్చాలంటూ ఆమెను బలవంతం పెట్టడంతో విసుగుచెందిన మరియమ్మ ఏసు, పెద్దకు తెలిపింది. వారు ముగ్గురు కలిసి సమీప పంట పొలాల్లోకి మేనత్తతో కబురు పంపి కోరిక తీరుస్తానంటూ నమ్మబలికి శివను మాటల్లో దించేలోగా ఇరువురు వచ్చి వెనుక నుంచి కరత్రో బలంగా మోదడంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరికి అనుమానం రాకుం డా విద్యుత్‌ షాక్‌గా చూపించేందుకు ముగ్గురు కలిసి గ్యాస్‌ లైటర్‌తో కొన్ని చోట్ల శరీరాన్ని కాల్చి  విద్యుత్‌ షాక్‌గా నమ్మబలికారు.దీంతో అనుమానం వచ్చిన సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌ విచారణ చేపట్టి కేసును ఛేదించి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఇందుకు సహకరించిన హెచ్‌సీలు కృష్ణ, భూషణం, కుమార్, పీసీలు చౌదరి, గణేష్, కాళి, విజయ్‌ను సీఐ వీరయ్యగౌడ్‌ అభినందించారు.
     
మరిన్ని వార్తలు