కూతుళ్లకు ఆస్తి రాసిస్తానంటే...

27 Jun, 2016 08:53 IST|Sakshi

పుట్లూరు(అనంతపురం): తన ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని అన్న కన్నతల్లిపై కక్ష కట్టిన కొడుకు ఆమె నిద్రిస్తున్న సమయంలో తన కొడుకు సాయంతో కర్రలతో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(75) తన తదనంతరం ఆస్తిని కూతుళ్లకు రాసిస్తానని చెప్తుండటంతో ఆమె పై కక్ష పెంచుకున్న చెన్నారెడ్డి, మనవడితో కలిసి ఈ రోజు తెల్లవారుజామున వృద్ధురాలిపై కర్రలతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు