జఫర్గఢ్: తల్లి మృతిని తట్టుకోలేక గుండెపోటుతో తనయుడు మృతి చెందిన ఘటన జఫర్గఢ్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సింగారపు రామనర్సమ్మ(75) శనివారం రాత్రి మృతి చెందింది. తల్లి మరణంతో కుమారుడు సింగారపు మారుతి (52) రోజంతా విలపించాడు.
ఆమె అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చాడు. రాత్రి పడుకున్న మారుతి అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే తల్లీ, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మారుతికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల టీఆర్ఎస్ నాయకులు గుజ్జరి రాజు, కుల్లా మోహన్రావు, బానోత్ రాజేష్నాయక్, మంచాల ఎల్లయ్య, నర్సింగం, కొత్వాల కుమార్, జ్యోతి యాకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నేబోయిన బిక్షపతి, చిట్టిమళ్ల కృష్ణమూర్తి, సీపీఎం నాయకులు రాపర్తి రాజు, ఆర్ సోమయ్య, టీడీపీ నాయకులు సిహెచ్ సోమనర్సయ్య, ఎస్ రమేష్, బీజేపీ నాయకులు జయశంకర్, మాడరాజు రాజుతో పాటు నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సంతాపం వ్యక్తం చేశారు.