నృత్యవిన్యాసం సమ్మోహితులను చేసింది.. నాట్య విలాసం ప్రేక్షకులను అలరించింది. శ్రీప్రకాష్ విద్యాసంస్థలో శుక్రవారం స్పిక్మెన్ నాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ ఎమాంగ్ ది యూత్ సంస్థ దేశంలో ఉన్న విద్యా సంస్థల్లోని యువతకు నాట్య కళ పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో నత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. స్పిక్మెన్ సంస్థ తరపున వచ్చిన కళాకారులు శ్రీప్రకాష్ విద్యా సంస్థలో ప్రదర్శన ఇచ్చారు. వీరు చేసిన ఒడిశా నత్యం గోట్టిపౌ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది.