పావగడలో పోటెత్తిన భక్తులు

12 Aug, 2017 22:43 IST|Sakshi
పావగడలో పోటెత్తిన భక్తులు

పావగడ: శ్రావణ మాసం సందర్భంగా స్థానిక శనీశ్వరాలయంలో తృతీయ శ్రావణ శనివారోత్సవం శనివారం అపురూపంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన 3 క్యూ లైన్లలో భక్తులు శుక్రవారం రాత్రి నుంచే బారులు తీరారు. ఉదయం 4 గంటలకే పూజలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సమీపంలోని శీతలాంబదేవి, కోటె ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయస్వామి వారికి భక్తులు పూజలు చేశారు. దీక్షా మండపంలో భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా అన్నదానం చేశారు.

మరిన్ని వార్తలు