శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.17కోట్లు

29 Oct, 2016 00:05 IST|Sakshi
మంత్రాలయం : అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీ మఠం రాఘవేంద్ర స్వామి హుండీ నుంచి రూ.1,17,29, 253 సమకూరినట్లు మఠం మేనేజర్‌ శ్రీనివాస రావు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన హుండీ లెక్కింపులో 50 గ్రాముల బంగారం, 442 గ్రాముల వెండీ , 1933 విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దసరా సెలవులు, శ్రీ మఠంలో కార్తీక పూజలు మెదలు కావడంతో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా హుండీ ఆదాయం అధికంగా వచ్చినట్లు చెప్పారు.  
 
మరిన్ని వార్తలు