ద్వారకా తిరుమల :శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన గర్రే రాఘవగుప్తా ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన భవనంలో ఈ విరాళాన్ని జమచేశారు. దాతకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్ను అందజేసి, అభినందించారు.