డిజిటల్‌ తరగతులు ప్రారంభం

17 Aug, 2016 22:31 IST|Sakshi
డిజిటల్‌ తరగతులు ప్రారంభం
అంతంపేట: మండలంలోని అంతంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బోధన సరళతరం చేయడానికి ఉపా«ధ్యాయులు బుధవారం డిజిటల్‌ తరగతి గదులను ప్రారంభించారు. ఈ పాఠశాలలో  6 నుంచి 10వ తరగతి వర కు  విద్యార్థుల కోసం రాజీవ్‌ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) వారు అవసరమైనా సాంకేతిక పరికరాలను పంపిణీ చేశారు. ఈ తరగతులను సర్పంచ్‌ రాచమళ్ల నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్‌ఎం సురేష్‌బాబు, రవీందర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు