రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

29 Jul, 2016 00:54 IST|Sakshi
వరంగల్‌ స్పోర్ట్స్‌ : వరంగల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్రస్థాయి అండర్‌–17, 19 జూనియర్‌ బాడ్మింటన్‌ పోటీల్లో భాగంగా గురువారం క్రీడాకారులకు క్వాలీ ఫైయింగ్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ సం ద ర్భంగా అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ హన్మకొండ సుబేదారిలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో రెండు రోజుల పాటు జరిగే పోటీలను పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపిచంద్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
క్వాలీ ఫైయింగ్‌ మ్యాచ్‌లకు పది జిల్లాల నుంచి 115 మంది క్రీడాకారులు హాజరైనట్లు చెప్పారు. ఇందులో అర్హత సాధించిన క్రీడాకారులు మెయిన్‌ డ్రాకు ఎంపికై పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, కోశాధికారి నాగకిషన్, జాతీయ అంపైర్‌ కొమ్ము రాజేందర్,  అంపైర్లు కిశోర్, హన్మంతరావు, శ్యాం, శ్రీధర్, మల్లికార్జున్, పీవీఎల్‌ కుమార్, పీసీఎస్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు