గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు

16 Jul, 2016 20:29 IST|Sakshi
గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు

-మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు

గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్న గ్రూప్-2 నూతన సిలబస్లో రాష్ట్ర విభజన అంశాలు, విభజన వలన ఏర్పడిన సవాళ్లు పేరుతో చేర్చారని పోటీ పరీక్షల బోధన నిపుణులు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అరం డల్పేటలోని గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్లో గ్రూప్-2కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నూతన సిలబస్పై అవగాహన కల్పించారు. 

లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ దానిని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణం, విభజన చట్టంలోని అంశాలు, ఉద్యోగుల విభజన, స్థానికత సమస్యలు, నదీ జలాల పంపిణీ-సమస్యలు, విభజన నేప థ్యంలో మౌలిక వసతులు, పెట్టుబడుల అవసరాలు వంటి అంశాలను జనరల్ స్టడీస్ పేపర్-1లో ఒక చాప్టర్గా చేర్చారని వివరిం చారు. అదే విధంగా పంచాయతీ కార్యదర్శి సిలబస్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.

మరిన్ని వార్తలు