గొల్లప్రోలు :
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో మాధురి విద్యాలయకు చెందిన విద్యార్థి కొశిరెడ్డి గణేశ్వరరావు ప్రతిభ కనబరిచాడు. ఇటీవల నరసరావుపేటలో అండర్ 14 విభాగంలో జరిగిన ఫుట్బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొన్నాడు. ఆటలో ప్రతిభ కనబరచినందుకు ఫుట్బాల్ టోర్నీ నిర్వాహకులు మెమెంటో, సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థినిని మాధురి విద్యాలయ కరస్పాండెంట్ కడారి తమ్మయ్యనాయుడు, ప్రిన్సిపాల్ ఎంఎం లూకోస్ అభినందించారు.