2 నుంచి రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

27 Jan, 2017 01:25 IST|Sakshi

ధర్మవరం టౌన్ : ధర్మవరంలోని ధర్మాంబ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ డైమండ్‌ ఓపెన్‌ హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాంబ హాకీ అసోసియేషన్‌ ప్రతినిధులు పల్లెం వేణుగోపాల్, బండి వేణుగోపాల్, బంధనాథం సూర్యప్రకాష్, వడ్డె బాలాజీ, ఉడుముల రాము, అశ్వర్థనారాయణ, హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో 12 జట్లు పాల్గొంటాయన్నారు. గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద రూ.20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.10 వేలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు చొప్పున బహుమతులు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో హాకీ కోచ్‌ హుసేన్, సీనియర్‌ క్రీడాకారులు ఉడుముల కిరణ్, జిన్నే చంద్ర, మధు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు