సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సుంకేసుల రిజర్వాయర్కు నీటి చేరిక నిలిచిపోయినట్లు డ్యాం వర్క్ ఇన్స్పెక్టరు మునిస్వామి సోమవారం తెలిపారు. దీంతో కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపేసామని, డ్యాంలో 1.15 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు.