వింతవ్యాధితో గొర్రెలు మృతి

23 Jun, 2016 11:27 IST|Sakshi

వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధితో 15 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం సురాజుపల్లె గ్రామపంచాయతీ కర్సుకుంటపల్లెలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నపుల్లమ్మ అనే కాపరికి చెందిన రూ.ఒకట్నిర లక్షల విలువైన 15 గొర్రెలు ఒక్కరోజులోనే వింతవ్యాధితో చనిపోయాయి.

పోషకుల సమాచారంతో పశువైద్యాధికారి శ్రీధర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నోటికి సంబంధించిన వ్యాధి గొర్రెలకు సోకుతోందని, అయితే లక్షణాలను బట్టి అది కొత్త వ్యాధి అని ఆయన తెలిపారు. మృత గొర్రెల నుంచి నమూనాలు సేకరించి లేబొరేటరీకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఫలితాలు అందిన అనంతరం వ్యాధి నిర్ధారణ అవుతుందని చెప్పారు. కాగా,ఈ గ్రామంలోని వారంతా గొర్రెల పెంపకాన్నే వృత్తిగా చేపట్టారు. సుమారు ఆరు వేల గొర్రెలను ఇక్కడ పోషించుకుంటున్నారు.

 

మరిన్ని వార్తలు