నేడు గిరిజనుల మహాదీక్ష

28 Aug, 2016 18:38 IST|Sakshi
జడ్చర్ల టౌన్‌ : ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని డిమాండ్‌  చేస్తూ సోమవారం పట్టణంలోని ఎర్రసత్యం స్మారక బస్టాండ్‌ సమీపంలో మహాదీక్ష నిర్వహిస్తున్నట్లు గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయక్‌ తెలిపారు. సదస్సుకు లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్‌రాంనాయక్‌తోపాటు ఆయా పార్టీల నాయకులు హాజరవుతారని తెలిపారు. సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు తరలి రావాలని కోరారు. 
>
మరిన్ని వార్తలు