కేసముద్రం : విష జ్వ రంతో ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన మండలంలోని కోమటిపల్లి శివారు పడమటి తండాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి న ప్రకారం.. తండాకు చెందిన భూక్య బీమా, లక్ష్మిల కుమార్తె శాన్వి(17) కురవి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. ఆమె పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది.
చౌటపల్లిలో వృద్ధురాలు..
పర్వతగిరి : విషజ్వరంతో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మండలంలో ని చౌటపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. చౌటపలికి చెందిన ఇత్తబోయి న ఐలమ్మ(65) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఉదయం కన్నుమూసింది. రెండు రోజు ల క్రితం ఇదే గ్రామానికి చెందిన గౌరార పు చిలుకమ్మ విషజ్వరంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. శనివారం ప్రభుత్వ వైద్య సిబ్బంది గ్రామంలో నామమాత్రపు వైద్య శిబిరం నిర్వహించి వెళ్లిపోయారని చౌటపల్లి సర్పంచ్ వంగా ల సంధ్యారాణి వాపోయారు.