తిరుమలగిరి: మండలంలోని ఈటూరు గ్రామానికి చెందిన జి.గౌతమ్ (6) అనే విద్యార్థి పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందాడు. గౌతమ్ గురువారం రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా పాము కాటు వేసింది. గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా అక్కడే మృతి చెందారు. మృతుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. మృతుడి సంతాప సూచకంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.