విద్యార్థిని అనుమానాస్పద మృతి

7 Jul, 2017 11:08 IST|Sakshi

తాడేపల్లిగూడెం రూరల్‌ : ప్రేమించిన యువకుడు మృతి చెందటంతో మనస్థాపం చెందిన 16ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో జరిగింది. స్థానిక వీకర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ రజియాబేగం (16) ఓ కళాశాలలో  ఇంటర్మీడియట్‌ చదువుతోంది. తాను ప్రేమించిన సురేష్‌ అనే యువకుడు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.

దీంతో మనస్థాపం చెందిన రజియా బేగం సురేష్‌ మృతదేహాన్ని చూసి వచ్చింది. రజియా బేగం గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. అన్నయ షేక్‌ ముస్తాఫా ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై సూర్యభగవాన్‌ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు