ఘట్కేసర్: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఔసాపూర్లో బుధవారం జరిగింది. ఔసాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి హాస్టల్ క్యాంపస్లో ఉరివేసుకున్ని చనిపోయాడు. ఈ సంఘటనను బుధవారం ఉదయం తోటి విద్యార్థులు గమనించి స్కూల్ యాజమాన్యానికి తెలిపారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.