ఆకట్టుకున్న పురాతన నాణేల ప్రదర్శన

14 Sep, 2016 22:05 IST|Sakshi

అత్తిలి :స్థానిక ఎస్వీఎస్‌ఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పాతనాణేలు, కరెన్సీనోట్లు, తపాలా బిళ్లల ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లికి చెందిన రిటైర్డు ఉద్యోగి అల్లుకృష్ణకుమారి తాను సేకరించిన 70 దేశాలకు చెందిన 150 కరెన్సీనోట్లు, 900 నాణేలు, 600 తపాలా బిళ్లలను ప్రదర్శనలో ఉంచారు. ఇండియాలో 18వ శతాబ్దం నాటి నాణేలను ప్రదర్శించారు. విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృష్ణకుమారి సర్పంచ్‌ కందుల కల్పన, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి సత్కరించారు. హెచ్‌ఎం కామర్సు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు